ప్రధాని మోడీ వంద రోజుల పాలనపై వ్యంగ్యస్త్రాలు వేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోడీ వంద రోజుల పాలన అభివృద్ధి లేకుండా ముందుకు కొనసాగుతుందని.. మోడీకి ధన్యవాదాలు అంటూ సెటైర్ వేశారు. నాయకత్వ లేమితో ప్రణాళిక లేకుండా..ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే మీడియా గొంతు నొక్కుతూ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ.
