కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

మహబూబాబాద్: జాతీయ పార్టీలు వికృత పార్టీలుగా మారాయన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. మహబూబాబాద్ లో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఆయన ఇవాళ  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశంలో కరెంట్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు.
ఢిల్లీలో కోతలు ఉన్నాయని,  తెలంగాణలో గల్లీ గల్లీలో ఫుల్ కరెంట్ వస్తోందన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఒక్క ఎకరం పారలేదని నడ్డా అంటున్నారని.. అది అవాస్తవమన్నారు. పాలమూరు ప్రాజెక్టు కట్టొద్దని కాంగ్రెస్ నేతలు కేసులు వేశారన్నారు.  కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు

కోనాపూర్ కు ఏమడిగితే అదివ్వాలని కేసీఆర్ అన్నరు

నారాయణను చిత్తూరుకు తరలించిన పోలీసులు