
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యంతో దేశ రాజధాని ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ టెస్టుల్లో భాగంగానే గురువారం సాయంత్రం ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిసింది. ‘కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా ఇవ్వాళ సాయంత్రం 7 గంటలకు శ్రీ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. రొటీన్ టెస్టులతోపాటు ఇన్వెస్టిగేషన్స్ కోసమే ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది’ అని శ్రీ గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ఇదే ఆస్పత్రిలో కడుపు నొప్పి కారణంగా ఫిబ్రవరిలో సోనియా చేరారు. ఈ రోజు ఉదయం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పార్టీ రాజ్య సభ మెంబర్లతో సోనియా డిస్కస్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ మీటింగ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తోపాటు పార్టీ టాప్ లీడర్స్ పాల్గొన్నారు.