అవినీతి తప్ప.. అభివృద్ధి లేదంటూ.. సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్​ కార్పొరేటర్లు

 అవినీతి తప్ప.. అభివృద్ధి లేదంటూ.. సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్​ కార్పొరేటర్లు

పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్​ పార్టీ వివిధ పనుల్లో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్​ కార్పొరేటర్లు ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అవినీతి తప్పా.. అభివృద్ధి జరగలేదని జూన్​ 22న జరిగిన కార్పొరేషన్​ సమావేశాన్ని కాంగ్రెస్​ కార్పొరేటర్లు బహిష్కరించి  ఆందోళనకు దిగారు. కార్పొరేషన్​ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవంటూ మేయర్​కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అదే సమయంలో వచ్చిన మేయర్​ అనిల్​కుమార్​.. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నప్పుడు నిరసనలు తెలపడం సరికాదని అంటూ కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఎఫ్​సీఐ ఎక్స్​రోడ్డు నుంచి ఎన్టీపీసీ రింగు రోడ్డు వరకు రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు, వివిధ పెండింగ్​పనుల మోక్షమెన్నడు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్పొరేటర్లు కార్పొరేషన్ ఆవరణలో కూర్చుని ఆందోళన నిర్వహించారు.