అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ కౌన్సిలర్లు...

అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ కౌన్సిలర్లు...

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పై జరిగిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలుపొందారు. జనవరి 23వ తేదీ మంగళవారం ఉదయం నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ విజయ బాబుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే,  అవిశ్వాసానికి టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ జయ బాబు హాజరుకాలేదు.13 కౌన్సిల్ సభ్యులతో అవిశ్వాసం తీర్మానంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నెగ్గారు.  దీంతో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్,  వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. త్వరలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకునే అవకాశం ఉంది.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్ లపై కూడా అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. మొత్తం 35 కౌన్సిల్ సభ్యులకు... అవిశ్వాసానికి అనుకూలంగా16 మంది  బీఆర్ఎస్ కౌన్సిలర్లు , 9 మంది కాంగ్రెస్  కౌన్సిలర్లు, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు.. మొత్తం 31 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లు తీర్మానికి గైర్హాజరయ్యారు.  ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకాకుండానే అవిశ్వాసం నెగ్గారు.  త్వరలో ఛైర్మెన్, వైస్ చైర్మన్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో  నేరేడుచర్ల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద టపాసులు పేలుస్తుండగా అపసృతి చోటుచేసుకుంది.  రవి అనే యువకుడి  చేతిలోనే బాంబు పేలడంతో.. అతని చేయి పూర్తిగా చింద్రమైపోయింది.  హుటాహుటిన హాస్పిటల్ తరలించారు.