మంత్రి వివేక్ వెంకటస్వామిపై ఫేక్ ప్రచారం

మంత్రి వివేక్ వెంకటస్వామిపై ఫేక్ ప్రచారం
  • చర్యలు తీసుకోవాలని పీఎస్​లో ఫిర్యాదు 

కోల్​బెల్ట్, వెలుగు: కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్న ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు, మరో వాట్సాప్​ గ్రూప్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ లీడర్లు గురువారం మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక మహర్షి వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పేరును ఈడీ చేర్చిందని, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఈనెల 11న సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో మందమర్రికి చెందిన బీఆర్ఎస్​ లీడర్లు బెల్లం అశోక్, సీపెల్లి సాగర్ తప్పుడు పోస్టులు పెట్టారు.

మంత్రిపై అనుచిత వ్యాఖ్యలతో ఫేక్​ పోస్టులు చేసిన ఆ ఇద్దరితోపాటు మంచిర్యాలకు చెందిన వాట్సాప్ ​గ్రూప్​ నిర్వాహకుడు రాజేశ్​పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఆకారం రమేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లీడర్లు ఎస్సై రాజశేఖర్​కు ఫిర్యాదు చేశారు.