కోల్బెల్ట్,వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగం నుంచి యువతను కాపాడుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.ఆదివారం మంచిర్యాల జిల్లా మంచిర్యాల,బెల్లంపల్లి పట్టణాల్లో ఎంపీ పర్యటించారు. జిల్లా కేంద్రం మోడల్స్కూల్, లైబ్రరీని సందర్శించారు. డిగ్రీ కాలేజ్ మైదానంలో మార్నింగ్వాక్లో పాల్గొన్న ఎంపీ వాకర్స్,క్రీడాకారులు,రిటైర్డు ఉద్యోగులతో మాట్లాడారు.
మోడల్ స్కూల్ విద్యార్థులు,పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారితో మాట్లాడారు. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లేకపోవడం,డ్రింకింగ్ వాటర్,ఇంటర్ నెట్, పార్కింగ్,విద్యుత్ సమస్యలు,లైబ్రరీ నిర్వహణపై ఆఫీసర్ల నిర్లక్ష్యం ఉందంటూ నిరుద్యోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తున్న లైబర్రీ ఇన్ఛార్జీ,ఆఫీసర్లపై ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు. అవసరమైన నిధులు కేటాయిస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్దీపక్ను ఆదేశించారు. అభివృద్ధి కోసం అవసరమైన చోట్ల ఎంపీ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ లీడర్,అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందంయాదవ్,ఓబీసీ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ ప్రభాకర్ తల్లి బండి లింగమ్మ చనిపోగా ఆమె భౌతిక కాయాన్ని ఎంపీ వంశీకృష్ణ,డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్రెడ్డి,కాంగ్రెస్ లీడర్లు సందర్శించి నివాళ్లుర్పించారు.
