ఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటైంది.దానికి మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేనిఫేస్టో కమిటీలో 16మంది సభ్యులు ఉండనున్నారు.
కమిటీ కన్వీనర్గా ఛత్తీస్గఢ్ మాజీ డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్దేవ్ ఉంటారు. సభ్యులుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్, శశిథరూర్ ఉండనున్నారు. మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్, ఎంపీ గౌరవ్ గొగోయ్,ఇతర నేతలు కమిటీలో ఉన్నారు. ఎన్నికల కోసం పార్టీ ఎజెండా, హామీలను ఈ కమిటీ ఖరారు చేయనుంది.