గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల మీటింగ్

గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల మీటింగ్

నిజామాబాద్​,  వెలుగు:  మున్సిపల్​ ఎన్నికలు పురస్కరించుకొని గురువారం హైదరాబాద్​లోని గాంధీభవన్​లో టీపీసీసీ చీఫ్​ మహేశ్​​గౌడ్ జిల్లా నేతలతో మీటింగ్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి​ మీనాక్షీ నటరాజన్, పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్​చార్జి​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి కూడా ఇందులో ఉన్నారు. 

జిల్లాకు చెందిన గవర్నమెంట్​ సలహాదారులు సుదర్శన్​రెడ్డి, షబ్బీర్​అలీ, కార్పొరేషన్​ చైర్మన్​లు మానాల మోహన్​రెడ్డి, అన్వేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.