ఉగ్రవాదానికి కాంగ్రెస్ తల్లి లాంటిది

ఉగ్రవాదానికి కాంగ్రెస్ తల్లి లాంటిది

ఖుషీనగర్: కాంగ్రెస్ పార్టీపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలకు దిగారు. దేశంలో ఉగ్రవాద మూలాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని యోగి ఆరోపించారు. ఖుషీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన యోగి.. ఆ తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఉగ్రవాదానికి కాంగ్రెస్ తల్లి లాంటిదని.. దేశాన్ని ఇబ్బందులు పెడుతున్న ఆ పార్టీని వదిలే ప్రసక్తే లేదన్నారు. 

‘దేశంలో టెర్రరిజానికి కాంగ్రెస్ తల్లి వంటిది. దేశ ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వారిని వదలబోం. కాంగ్రెస్ రాముడ్ని అవమానించి మాఫియాకు ఆశ్రయం ఇచ్చింది. తాలిబాన్ అనుకూల, వంశ పారంపర్య, కుల రాజకీయాలు చేసే కాంగ్రెస్‌ను ప్రజలు సహించకూడదు. బీజేపీ ప్రజల వైపు ఉంది. వారి కష్టాలు, బాధలను తీర్చుతోంది. మేం శ్రీరాముడి ఆలయాన్ని  కడతున్నాం. మాఫియాను వారు ఉండాల్సిన చోటుకు పంపుతున్నాం. బీజేపీ పవర్‌లో ఉంటే అందరికీ సరైన గౌరవం దక్కుతుంది’ అని ఆదిత్యనాథ్ అన్నారు.