మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

కోల్​బెల్ట్, వెలుగు: ప్రజల తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బోర్​లు ఏర్పాటు చేస్తున్నారని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ లీడర్ బండి సదానందంయాదవ్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని 24వ వార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి, ఎంపీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు వారు అండగా నిలుస్తున్నారని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు.  

మంత్రి శ్రద్ధతోనే క్యాతనపల్లిలో అభివృద్ధి 

మంత్రి వివేక్ వెంకటస్వామి శ్రద్ధతోనే క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ​రాష్ట్ర నాయకుడు రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ లోని పార్టీ ఆఫీస్​లో ఆయన మాట్లాడారు. మంత్రిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్​పాలకులు శంకుస్థాపనలతో కాలం గడిపారే తప్ప ఎక్కడా పనులు చేయలేదని విమర్శించారు. పార్టీ పట్టణ ప్రెసిడెంట్ పల్లె రాజు, నాయకులు శ్రీనివాస్, కనకరాజు, రాజం, ప్రేమ్ సాగర్, సురేశ్, రాజయ్య, సంఘ రవి పాల్గొన్నారు