హైదరాబాద్, వెలుగు: ప్రవళికది ఆత్మ హత్య కాదని, ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నదన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఓ పేద విద్యార్థిని సూసైడ్ చేసుకుంటే బీఆర్ఎస్ నేతలు ఆమె క్యారెక్టర్పై నిందలు వేస్తున్నారని మండి పడ్డారు.
బీఆర్ఎస్ సర్కారుకు ఉద్యోగాలు భర్తీ చేయడం చేతకాదన్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి ఉందన్నారు. మోదీ హయాంలోనూ విద్యార్థుల ఆత్మహత్యలు 70 శాతం పెరిగాయన్నారు. రైతు ఆత్మహత్యలకు మించి విద్యార్థుల సూసైడ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. దేశం, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ప్రశ్నించినోళ్లపై కేసులు పెడుతున్నారని కన్హయ్య కుమార్ విమర్శించారు.