హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 25 కిలోల సన్న బియ్యం బ్యాగ్ ను కాంగ్రెస్ నేత, ఫిషరీస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కానుకగా ఇచ్చారు. శుక్రవారం గాంధీ భవన్ నుంచి ర్యాపిడో ద్వారా ఈ బియ్యం బ్యాగ్ ను తెలంగాణ భవన్కు పంపించారు.
అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ.. ఇటీవల కేటీఆర్ఓ నిరుపేద ఇంట్లోకి వెళ్లి సర్కారు ఇస్తున్న సన్న రేషన్ బియ్యం తిన్నందుకు కృతజ్ఞతగా ప్రతి నెలా ఆయనకు బియ్యం పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
