దో గంటే టైంపాస్.. లోక్ సభలో మోదీ చేసింది ఇదే

 దో గంటే టైంపాస్.. లోక్ సభలో మోదీ చేసింది ఇదే
  • లోక్ సభలో మోదీ చేసింది ఇదే
  • మణిపూర్ అంశాన్ని తమాషాగా మార్చారు
  • రాష్ట్రం తగులబడుతుంటే నవ్వుతూ జోకులేశారు
  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. పార్లమెంట్​లో మోదీ మణిపూర్​ అంశాన్ని తమాషా చేశారంటూ మండిపడ్డారు. రెండు గంటల ప్రసంగంలో మణిపూర్​ అంశాన్ని రెండు నిమిషాలు మాత్రమే ప్రస్తావించారన్నారు. ‘ఈశాన్య రాష్ట్రం తగలబడుతుంటే సభలో ప్రధాని నవ్వుతూ జోకులు వేశారు. ఈ హింసను ఆయన ఎందుకు ఆపలేకపోయారంటూ రాహుల్​ ప్రశ్నించారు.

భారత్​ను హత్య చేశారని నేను అనలేదు. మణిపూర్​ను హత్యచేశారు.. రెండుగా చీల్చారని చెప్పడమే నా ఉద్దేశం. నిప్పుల గుండంలా రగులుతున్న మణిపూర్​లో బీజేపీ మరింత ఆజ్యం పోసింది. అక్కడి దారుణ పరిస్థితులు చూసి కేంద్ర దళాలే ఆశ్చర్యపోయాయి. మోదీ వ్యవహరించిన తీరు సరైంది కాదు’ అంటూ రాహుల్​ మండిపడ్డారు.