వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవిపై హర్షం : కాంగ్రెస్ లీడర్లు

వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవిపై హర్షం : కాంగ్రెస్ లీడర్లు
  • తిమ్మాపూర్ జగదాంబేశ్వర ఆలయంలో కాంగ్రెస్​ లీడర్ల పూజలు 

కోల్ బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖల మంత్రి పదవి రావడంపై కాంగ్రెస్ ​లీడర్లు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మందమర్రి మండలంలోని తిమ్మాపూర్ జగదాంబేశ్వర ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ 101 కొబ్బరికాయలు కొట్టారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పేరుమీద ప్రత్యేక పూజలు చేయించారు.

కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి(కాకా) కుటుంబం 40 ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్​ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కాకా బుల్లెట్ గాయాలు తిన్నారని, మలిదశ ఉద్యమంలో ఆయన తనయుడు మంత్రి వివేక్ వెంకటస్వామి పార్లమెంట్​లో గళం విప్పారని కొనియాడారు. అనంతరం మంత్రి ఆదేశాల మేరకు ఆలయంలో నూతన బోర్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో క్యాతనపల్లి కాంగ్రెస్ ప్రెసిడెంట్ పల్లె రాజు, నాయకులు పాల్గొన్నారు.