రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో ఈనెల 2న నిర్వహించనున్న వేంకటేశ్వర స్వామి కల్యాణానికి హాజరుకావాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ నాయకులు కోరారు.
మంగళవారం పటాన్చెరు కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మంత్రిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మహా చండీ రుద్రయాగ సహిత కల్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించబోతున్నట్లు మంత్రికి వివరించారు.
