ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రాజీవ్ గాంధీకి నివాళి..

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రాజీవ్ గాంధీకి నివాళి..

వెలుగు, నెట్​వర్క్​: దివంగత మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ వర్ధంతిని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్​ పార్టీ నాయకులు నిర్వహించారు. గురువారం ​వరంగల్​లో డీసీసీ ప్రెసిడెంట్ మహ్మద్​ఆయూబ్, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్​ఇనుగాల వెంకట్రామ్​రెడ్డి​ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు రాజీవ్​గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్​ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైరా రింగ్​రోడ్డు సెంటర్​లోని రాజీవ్​ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే రాందాస్​నాయక్ నివాళులర్పించారు. 

అనంతరం ఆయన నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​భవన నిర్మాణ పనులను పరిశీలించారు. దమ్మపేట మండలం గుండుగులపల్లి క్యాంప్​ఆఫీస్​లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాళులర్పించగా, కామేపల్లి మండలం పాతలింగాలలోని రాజీవ్​గాంధీ విగ్రహానికి రాష్ట్ర అగ్రికల్చర్​ కమిషన్​ మెంబర్​ రామ్​రెడ్డి గోపాల్​రెడ్డి నివాళులర్పించారు. ఆయా మండల కేంద్రాల్లో నాయకులు, నేతలు నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.