బాల్క సుమన్.. మంత్రి వివేక్ పై విమర్శలు మానుకో ..వ్యక్తిగత గొడవలను రాజకీయం చేయొద్దు : కాంగ్రెస్ లీడర్లు

బాల్క సుమన్.. మంత్రి వివేక్ పై విమర్శలు మానుకో ..వ్యక్తిగత గొడవలను రాజకీయం చేయొద్దు : కాంగ్రెస్ లీడర్లు
  • బాల్క సుమన్​ఆరోపణలపై కాంగ్రెస్ లీడర్ల ఫైర్​

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం షెట్​పల్లిలో ఇద్దరు గీత కార్మికుల మధ్య జరిగిన కుటుంబ తగాదాల విషయంలో మంత్రి వివేక్ ​వెంకటస్వామిపై బాల్క సుమన్​చేసిన ఆరోపణలు సరికాదని గ్రామ కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. సోమవారం రాత్రి  ప్రెస్​నోట్​ నిర్వహించిన గ్రామస్తులు, కాంగ్రెస్ లీడర్లు ఖండించారు. 

లీడర్లు తాళ్లపల్లి కిరణ్, సురేశ్​గౌడ్​మాట్లాడుతూ.. గత కొద్ది కాలంగా ఇద్దరు గౌడ కులస్తుల మధ్య వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా, భూతగాదాలున్నాయని.. వారు సోమవారం మరోసారి గొడవపడితే ఈ ఘటనను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ​రాజకీయంగా మార్చి మంత్రి వివేక్​ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. 

బీఆర్ఎస్​ హయాంలో హత్య రాజకీయాలను ప్రోత్సాహించారని, అందుకే చెన్నూరు ప్రజలు బాల్క సుమన్​కు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అయినప్పటికీ సుమన్, బీఆర్ఎస్​ లీడర్లకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ది కోసం నీతినిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్న మంత్రి వివేక్​ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.