భూంపల్లి మండలంలో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

భూంపల్లి మండలంలో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

దుబ్బాక, వెలుగు: మంత్రి వర్గంలో సామాజిక న్యాయాన్ని పాటించిన సీఎం రేవంత్​రెడ్డి ఫ్లెక్సీకి సోమవారం అక్భర్​పేట భూంపల్లి మండల కేంద్రంలో బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు పాతూరి వెంకట స్వామి గౌడ్​ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్​తోనే సామాజిక న్యాయం లభిస్తుందన్నారు. బీఆర్ఎస్​ పాలనలో ముగ్గురు కుటుంబ సభ్యులకు, ఒకే ఒక్క దళిత సామాజిక వర్గానికి మంత్రి పదవులిచ్చి అన్యాయం చేశారని ఆరోపించారు. 

రేవంత్​రెడ్డి ప్రభుత్వం దళిత వర్గానికి చెందిన నలుగురికి, ముగ్గురు బీసీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించడం హర్షనీయమన్నారు. లంబాడి వర్గానికి డిప్యూటీ స్పీకర్​, బీసీ వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషించ దగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కమలాకర్​, కూడవెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, నాయకులు వంశీచందర్​ రెడ్డి, సుమలత, లోకేశ్​ గౌడ్, స్వామి, స్వప్న బాలరాజు, యాదగిరి, ప్రభాకర్​ చారి, మధుసూదన్​రెడ్డి పాల్గొన్నారు.