
దుబ్బాక, వెలుగు: మంత్రి వర్గంలో సామాజిక న్యాయాన్ని పాటించిన సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి సోమవారం అక్భర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకట స్వామి గౌడ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం లభిస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ముగ్గురు కుటుంబ సభ్యులకు, ఒకే ఒక్క దళిత సామాజిక వర్గానికి మంత్రి పదవులిచ్చి అన్యాయం చేశారని ఆరోపించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం దళిత వర్గానికి చెందిన నలుగురికి, ముగ్గురు బీసీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించడం హర్షనీయమన్నారు. లంబాడి వర్గానికి డిప్యూటీ స్పీకర్, బీసీ వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషించ దగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కమలాకర్, కూడవెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, నాయకులు వంశీచందర్ రెడ్డి, సుమలత, లోకేశ్ గౌడ్, స్వామి, స్వప్న బాలరాజు, యాదగిరి, ప్రభాకర్ చారి, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.