
గచ్చిబౌలి, వెలుగు: బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనను తరిమికొట్టాలని.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ను గెలిపించాలని ఆ పార్టీ శేరిలింగంపల్లి అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వివేకానందనగర్ డివిజన్లోని రామకృష్ణానగర్, హనుమాన్నగర్, ఆర్పీ కాలనీలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తాను గెలిచిన వెంటనే అమలు చేస్తానని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.