అక్రమంగా ఓట్లు తొలగించారు.. 100శాతం పక్కా ఆధారాలున్నాయ్:రాహుల్ గాంధీ

అక్రమంగా ఓట్లు తొలగించారు.. 100శాతం పక్కా ఆధారాలున్నాయ్:రాహుల్ గాంధీ

 కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్​ ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్​ టార్గెట్​గా ఈసీ  అక్రమంగా ఓట్లను తొలగించిందని ఆరోపించారు. సెంట్రలైజ్డ్​ సిస్టమ్​ తో ప్లాన్​ ప్రకారమే ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. బాధితులను ప్రత్యక్ష సాక్షులుగా మీడియా ముందుంచారు రాహుల్​గాంధీ. కాంగ్రెస్​ ను ఓడించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లను అక్రమంగా తొలగించారు మా దగ్గర పక్కా ఆధారాలున్నాయని రాహుల్​ గాంధీ చెప్పారు.  

న్యూఢిల్లీ: కర్ణాటకలో అక్రమంగా ఓట్లను తొలగించింది ఈసీ.. ఓటర్లకు తెలియకుండా ఓటర్​ లిస్టు నుంచి డిలీట్​ చేశారు. మాదగ్గర 100 శాతం పక్కా ఆధారాలున్నాయన్నారు కాంగ్రెస్​ ఎంపీ, పార్లెమెంటరీ ప్రతిపక్షనేత రాహుల్​ గాంధీ. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ భవన్​ లో  నిర్వహించిన ప్రెస్​ మీట్​ ఓట్లు తొలగించబడిన బాధితులను మీడియా ముందు ఉంచారు రాహుల్​ గాంధీ. 

►ALSO READ | బిహార్ లో .. పీకే హవా పెరుగుతోందా?

కర్ణాటకలో పక్కా ఓట్ల చోరీ జరిగింది.. కాంగ్రెస్​ టార్గెట్​గా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తొలగించారు. ఉద్దేశపూర్వకంగానే ఓట్లను తొలగించారని. కర్ణాటకలో ఓట్లచోరీని మేం అడ్డుకున్నామని రాహుల్​ అన్నారు. ఫేక్​ అప్లికేషన్లు ఫైల్ చేశారని మా దగ్గర పక్కా ఆధారాలున్నాయంటూ స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. 

CEC జ్ణానేశ్వర్​ కుమార్​ పై రాహుల్​ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్​ గాంధీ.కర్ణాటకలో ఓట్లను తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్​ నంబర్లు వాడారని అన్నారు. సూర్యకాంత్​ పేరుతో 12 నిమిషాల్లోనే 14 అప్లికేషన్లు వెళ్లాయన్నారు. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థనే హైజాక్​  చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఓట్ల చోరులను చీఫ్​ ఎలక్షన్​కమిషనర్​ రక్షిస్తున్నారని అన్నారు. కర్ణాటక సీఐడీ అడిగిన వివరాలను వారంలోగా ఈసీ ఇవ్వాలని రాహుల్​ గాంధీడిమాండ్​ చేశారు. 

కర్ణాటక ఎన్నికల సమయంలో వేలసంఖ్యలో ఓట్లను తొలగించారు..సెంట్రలైజ్డ్​ సిస్టమ్​ తో ప్లాన్​ ప్రకారమే ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్​ టార్గెట్​ గానే ఓట్ల తొలగింపు చేశారని అన్నారు రాహుల్​ గాంధీ.   మరోవైపు మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6851 ఓట్లను అక్రమంగా తొలగించారని రాహుల్​ గాంధీ అన్నారు.