
సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి లేఖ
వ్యవసాయ, ఎల్ఆర్ఎస్ బిల్లులపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని లేఖలో కోమటిరెడ్డి కోరారు.
వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని , రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని లేఖలో కోమటిరెడ్డి కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అసెంబ్లీలు ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రికి లేఖ ద్వారా తెలిపారు. సామాన్యుడికి పెనుభారంగా మారిన ఎల్ఆర్ఎస్ని ప్రభుత్వం రద్దు చేయాలని, సాధ్యం కాని పక్షంలో ఎటువంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.