లేక్ ప్రొటెక్షన్ కమిటీలను నియమించండి

లేక్ ప్రొటెక్షన్ కమిటీలను నియమించండి
  • సీఎం రేవంత్​కు ఎంపీ మల్లు రిక్వెస్ట్

హైదరాబాద్, వెలుగు: లేక్స్ అన్నింటికి లేక్ ప్రొటెక్షన్ కమిటీలను నియమించాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కోరారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. "కేసీఆర్ పాలనలో హైదరాబాద్​లో చిన్నపాటి వర్షం పడితేనే జన జీవనం స్తంభించిపోయేది. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలతో హైదరాబాద్ ను ప్రపంచస్థాయిలో నిలబెట్టే అవకాశం వచ్చింది.

క్లియర్ చేస్తున్న లేక్స్ అన్నింటికి లేక్ ప్రొటెక్షన్ కమిటీలను నియమించాలి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న 4  చెరువులను కాపాడాలి. చెరువులను కబ్జా చేసి కట్టిన విద్యా సంస్థల భవనాలను ఇప్పటికిప్పుడు కూల్చకుండా విద్యార్థులకు సెలవులు వచ్చే వరకు ఆగుతామనడం మానవత్వంతో కూడిన రేవంత్ పాలనకు నిదర్శనం.

మూసీ రివర్​కు శాశ్వత పరిష్కారం కోసం 12 వేల కట్టడాలను గుర్తించాం. హైదరాబాద్ ప్రజలకు అంటువ్యాధులు, దోమల బెడద నివారణకు మూసీ ప్రక్షాళన చేపట్టాలి. రాష్ట్ర భవిష్యత్తుకు సీఎం రేవంత్ బంగారు బాటలు వేస్తున్నారు" అని మల్లు రవి పేర్కొన్నారు.