
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ పాలనలో ఉద్యోగ నియామకాలు జోక్గా మారాయన్నారు. అవినీతి పెరిగిందని, ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు.