ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని జూబ్లీహిల్స్ గెలుపుపై కాంగ్రెస్ సంబరాలు

ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని జూబ్లీహిల్స్ గెలుపుపై కాంగ్రెస్ సంబరాలు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​అభ్యర్థి నవీన్​యాదవ్​ఘన విజయం సాధించడంతో ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఈ గెలుపుతో హైదరాబాద్​లో కాంగ్రెస్​బలపడిందని తెలిపారు. బీఆర్ఎస్​ఫేక్​ప్రచారాన్ని అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. 

ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్​కు ఇన్​చార్జులుగా ఉన్న మంత్రులు వివేక్​ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్​గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్​శ్రేణులను సమన్వయం చేసి సక్సెస్​అయ్యారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థలు, జీహెచ్ఎంఎసీ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

రామకృష్ణాపూర్ లోని కాంగ్రెస్ ఆఫీస్​లో పీసీసీ మెంబర్, కాంగ్రెస్ సీనియర్​నాయకుడు పిన్నింటి రఘునాథ్​రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్​రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. చెన్నూరులోని మంత్రి క్యాంప్ ​ఆఫీస్ ఎదుట పటాకులు కాల్చారు.  - నెట్​వర్క్, వెలుగు