ఆగస్టు 28 నుంచి కాంగ్రెస్ మూడో విడత జనహిత యాత్ర

 ఆగస్టు 28 నుంచి కాంగ్రెస్  మూడో విడత జనహిత యాత్ర

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మూడో విడత జనహిత పాదయాత్ర ఈ నెల 28 నుంచి ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం గాంధీ భవన్ మీడియాకు విడుదల చేసింది. 28న నల్గొండ జిల్లాలోని నకిరేకల్ లో, ఈ నెల 29న మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో సాగనున్న ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. 

దీన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు గాంధీ భవన్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టామని పీసీసీ నాయకత్వం స్పష్టం చేసింది.