
పంజాబ్లో కాంగ్రెస్ ప్రచారాన్ని దూకుడు పెంచింది. రాబోయే మూడు రోజులపాటు అగ్రనేతలను రంగంలోకి దింపి ప్రచారంతో హోరెత్తించే విధంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. రేపు సీర్ గోవర్ధన్ పూర్ లో సంత్ రావిదాస్ జయంతికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ పంజాబ్ లో ప్రచారం చేయనున్నారు. పంజాబ్ లో రెండోసారి కాంగ్రెస్ గెలుపు కోసం కోసం రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారని..అందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇంటింటి ప్రచారం, రోడ్ షోల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో దూకుడు పెంచుతూ ప్రచారం చేయడం ఇదే తొలిసారి.
మరిన్ని వార్తల కోసం