కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్ఎస్.. పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత

కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్ఎస్..  పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత

హైదరాబాద్:  పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  ధర్మారంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నాయకులు​ పోటాపోటీ ప్రదర్శనలు చేశారు.  మండలంలో తామంటే తామే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూ ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చలకు సవాళ్లు విసురుకున్నారు.  ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.  

ALSO READ | జీవన్ రెడ్డి ఇప్పటికే 8 సార్లు ఓడిపోయిండు కాంగ్రెస్​లో ఓటమికి కేరాఫ్ అడ్రస్​ఆయనే: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ 

పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళకారులను నియంత్రించారు. గత నాలుగైదు రోజులుగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్​నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి.  బీఆర్ఎస్​నాయకులు అభివృద్ధిపై చర్చకు నంది మేడారానికి రావాలని సూచించారు. ఈ క్రమంలో ఇవాళ నంది మేడారానికి కాంగ్రెస్‌ నేతలు చేరుకున్నారు.  

అదే సమయంలో బీఆర్ఎస్​నాయకులు ధర్మారం బస్టాండ్‌ ప్రాంతం నుంచి ర్యాలీగా చౌరస్తాకు బయల్దేరారు. పోలీసులు వారిని మధ్యలో అడ్డుకున్నారు.  ఇరు పార్టీల నేతల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది.