
- ఆలయాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పూజలు
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి-–సరోజ దంపతుల పెళ్లిరోజును పురస్కరించుకొని శుక్రవారం మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్శ్రేణులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండో వార్డు తిలక్నగర్ ఏరియాలోని పేదలకు కాంగ్రెస్ లీడర్, మందమర్రి మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.
చెన్నూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పట్టణ, రూరల్, కోటపల్లి, భీమారం మండల కాంగ్రెస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్లో కేక్ కట్చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొతుకు సుదర్శన్, పూల్లూరి లక్ష్మణ్తదితరులు మందమర్రి మార్కెట్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, స్థానికులకు పండ్లు, స్వీట్లు పంచారు.
పాలచెట్టు హనుమాన్టెంపుల్, మార్కెట్లోని హనుమాన్ టెంపుల్లో కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యే దంపతుల పేరిట ప్రత్యేక పూజలు జరిపించారు. రామృష్ణాపూర్లోని విజయగణపతి ఆలయంలో టౌన్ప్రెసిడెంట్పల్లె రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూజలు చేశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏడాది కాలంలోనే చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం వందల కోట్ల ఫండ్స్ మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.