ఫిరోజాబాద్: పోలీస్ మెస్లో నాణ్యతలేని ఫుడ్డు పెడుతున్నారంటూ ఓ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ ఫుడ్డు జంతువులు కూడా తినవు. ఇది తిని పోలీసులు ఎలా పనిచేస్తారు’ అంటూ బోరున విలపించాడు. ప్లేట్లో రోటీలు, పప్పుతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపాడు. ఈ వీడియో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో మనోజ్ కుమార్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అక్కడి పోలీసుల మెస్లోనే భోజనం చేసేవాడు. అక్కడి ఫుడ్ బాగా లేకపోవడంతో రోజూ కంప్లైంట్ చేసేవాడు. అయినా వాళ్ల తీరు మారకపోవడంతో నిరసనకు దిగాడు. రోటీలు, పప్పు, అన్నం వడ్డించిన ప్లేట్ను చేతిలో పట్టుకుని ఉన్నతాధికారుల ముందు విలపిస్తూ నాణ్యతను ప్రశ్నించాడు. క్వాలిటీ లేని ఈ ఫుడ్డు తిని పోలీసులు కఠినమైన డ్యూటీలు ఎలా చేస్తారని ప్రశ్నించాడు. నడిరోడ్డుపై కూర్చుని నిరసన తెలిపాడు.