ఆదిలాబాద్జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్జిల్లాలో గుండెపోటుతో  కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  గుండెపోటుతో కానిస్టేబుల్ చనిపోయిన ఘటన ఆదిలాబాద్​జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని  టూటౌన్​పోలీస్​స్టేషన్​కానిస్టేబుల్​పద్మావార్​ప్రకాశ్(55) ఆదివారం తన సొంతూరు ఉట్నూరు నుంచి టూ టౌన్ స్టేషన్ కు డ్యూటీలో భాగంగా బస్సులో వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆయనకు తోటి ప్రయాణికులు సీపీఆర్​ చేసి అంబులెన్స్​లో రిమ్స్​కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. ప్రకాశ్ కు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. 

కానిస్టేబుల్ డెడ్ బాడీకి ఎస్పీ అఖిల్​మహాజన్ నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.30,000 అందించారు. బాధిత కుటుంబానికి అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సీఐలు సిహెచ్.కరుణాకర్ రావు, జి.మొగిలి, ఎస్ఐ  మనోహర్, సిబ్బంది  ఉన్నారు.