
ఆదిలాబాద్టౌన్, వెలుగు: గుండెపోటుతో కానిస్టేబుల్ చనిపోయిన ఘటన ఆదిలాబాద్జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని టూటౌన్పోలీస్స్టేషన్కానిస్టేబుల్పద్మావార్ప్రకాశ్(55) ఆదివారం తన సొంతూరు ఉట్నూరు నుంచి టూ టౌన్ స్టేషన్ కు డ్యూటీలో భాగంగా బస్సులో వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆయనకు తోటి ప్రయాణికులు సీపీఆర్ చేసి అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. ప్రకాశ్ కు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
కానిస్టేబుల్ డెడ్ బాడీకి ఎస్పీ అఖిల్మహాజన్ నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.30,000 అందించారు. బాధిత కుటుంబానికి అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సీఐలు సిహెచ్.కరుణాకర్ రావు, జి.మొగిలి, ఎస్ఐ మనోహర్, సిబ్బంది ఉన్నారు.