బాటమ్​ యాష్​ నిరంతరం రవాణా చేయాలి : శ్రీరాంపూర్​ ఏరియా జీఎం శ్రీనివాస్​

బాటమ్​ యాష్​ నిరంతరం రవాణా చేయాలి : శ్రీరాంపూర్​ ఏరియా జీఎం శ్రీనివాస్​

కోల్​బెల్ట్, వెలుగు: శ్రీరాంపూర్​ఏరియాలోని అండర్ గ్రౌండ్ ​బొగ్గు గనులకు సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్​ నుంచి నిరంతరం బాటమ్ యాష్​ట్రాన్స్​పోర్ట్​ చేయాలని సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్​ అన్నారు. జైపూర్​సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్​కు బాటమ్​ యాష్​రవాణాపై ప్లాంట్​ఈడీ చిరంజీవులు, ఇతర ఆఫీసర్లతో ఆదివారం జీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలోని ఇందారం1ఏ, ఎస్పార్సీ3, ఆర్కే-7 అండర్ గ్రౌండ్​ మైన్ల స్ట్రవింగ్​కు కావాల్సిన బాటమ్​యాష్​రవాణాలో జాప్యం లేకుండా చూడాలన్నారు.

పని స్థలాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం లేకుండా యాష్​సప్లైకి అవసరమైన చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలని కోరగా అందుకు ప్లాంట్​ఈడీ, ఆఫీసర్లు అంగీకరించారు. సమావేశంలో ఎస్టీపీపీ జీఎం శ్రీనివాస్, ఆర్కే7, ఇందారం, ఎస్సార్పీ3, 3ఏ గ్రూపు గనులు ఏజెంట్లు కుర్మా రాజేందర్, ఎ.వెంకటేశ్వర్​రెడ్డి, సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎస్టీపీపీ ఆఫీసర్లు సబ్బని లక్ష్మణ్, కేవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.