ఉపాధి పనులు చేస్తుంటే రాగి నాణేలు దొరికినయ్​!

ఉపాధి పనులు చేస్తుంటే రాగి నాణేలు దొరికినయ్​!

బాలానగర్​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా బాలానగర్​ మండలం నందారం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా రాగి నాణేలు దొరికాయి. తహసీల్దార్ ​శ్రీనివాస్​ కథనం ప్రకారం.. సర్వే నంబర్​ 83లో లింబ్యా నాయక్​కు చెందిన పొలంలో కొద్ది రోజులుగా ఉపాధి హామీ పథకం కింద కూలీలు కుంట పనులు చేస్తున్నారు. సోమవారం పొలంలో తవ్వుతుండగా నిజాం కాలానికి చెందిన 228 రాగి నాణేలు కనిపించాయి. విలేజ్ ​సెక్రెటరీ నరేశ్ ​విషయాన్ని తహసీల్దార్​కు చెప్పడంతో అక్కడికి వచ్చిన ఆయన పంచనామా నిర్వహించారు. పురావస్తు శాఖ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసుల సమక్షంలో రాగి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వెంట ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.