దహెగాం, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి అందులోని కాపర్ వైర్ చోరీ చేశారు. ఈ ఘటన దహెగాంలో జరిగింది. బాధిత రైతు చప్పిడి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం శివారులోని తన వ్యవసాయ భూమికి మంగళవారం ఉదయం వెళ్లి చూడగా తన పొలం సమీపంలో అమర్చిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను కొందరు పగులగొట్టి కాపర్వైర్ను ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. విషయాన్ని విద్యుత్అధికారులకు తెలియజేయగా వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
