కరోనా అలర్ట్.. రోడ్ల మీద ఉమ్మితే ఫైన్​

కరోనా అలర్ట్.. రోడ్ల మీద ఉమ్మితే ఫైన్​
  • కరోనా నియంత్రణకు పబ్లిక్​ ప్లేసుల్లో నిఘా 
  • అధికారులు, సిబ్బందికి బల్దియా ఆదేశాలు 

హైదరాబాద్​, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే ఫైన్​వేసేందుకు బల్దియా సిద్ధమైంది. కరోనా  నియంత్రణలో భాగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గురువారం కమిషనర్ డీఎస్​ లోకేశ్​కుమార్​ సర్క్యూలర్ జారీ చేశారు. అడిషనల్ కమిషనర్లు, హెచ్​వోడీలు, జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఆఫీసుతో పాటు, పబ్లిక్ ప్లేసెస్ లో తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కనీసం రెండు గజాల దూరాన్ని పాటించేలా చూడాలని సూచించారు.  ఆఫీసులు, సెక్షన్లలో విజిటర్లను నియంత్రించాలని, ప్రవేశ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నా రు.  లిఫ్ట్ ల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించాలన్నారు. ఎమర్జెన్సీ మినహా ఫైళ్లన్నింటిని ఈ -ఆఫీస్ ద్వారానే పంపించాలన్నారు. ఎయిర్ కండీషన్లు, కూలర్ల వినియోగాన్ని తగ్గించాలని ఆ సర్క్యూలర్​లో పేర్కొన్నారు.