వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పురుడు పోసుకుంది

వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పురుడు పోసుకుంది
  • స్పష్టమైన ఆధారాలున్నాయన్న అమెరికా

వాషింగ్టన్ : చైనా లోని వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ పురుడు పోసుకుందని అమెరికా మరోసారి ఆరోపించింది. ఐతే ఈ సారి మాత్రం ఈ ఆరోపణలకు పక్కా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ కావాలనే చైనా కరోనా వైరస్ ను ల్యాబ్ ను విడుదల చేసిందని చెప్పారు. చైనా కుట్రను త్వరలోనే ప్రపంచం ముందు ఉంచుతామని ఆయన అన్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించటానికి చైనాయే కారణమంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు కరోనా వైరస్ పుట్టుక వుహాన్ ల్యాబ్ లోనే జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై అమెరికా ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా వుహాన్ ల్యాబ్ లోనే పుట్టిందంటూ ఆధారాలున్నాయని మైక్ పాంపియో చెప్పటంతో నిజంగానే అమెరికాకు ఏమైనా ఆధారాలు దొరికాయా అన్నది ఆసక్తిగా మారింది. వైరస్ కారణంగా జరిగిన నష్టాన్ని చైనా నుంచి కోరుతామని కూడా అమెరికా చెబుతోంది. అమెరికా మాదిరిగానే ఫ్రాన్స్ కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత కరోనా వైరస్ వుహాన్ నుంచి బయటకు వచ్చిందని ఇదివరకే చెప్పారు. తాజాగా జపాన్ కు చెందిన ఓ సైంటిస్టు కూడా ఇదే ఆరోపణ చేశారు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లవుతోంది.