దేశంలో 67 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 67 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా  కేసులు 67 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 72,049 కొత్త కేసులు నమోదవడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 67,57,132కు చేరింది. 986 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య1,04,555 కు చేరింది. నిన్న ఒక్కరోజే 82,203 మంది కోలుకున్నారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు 57,44,694 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 9,07,883 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 85.05 శాతం ఉండగా మరణా రేటు1.55 గా ఉంది. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 6 వరకు కరోనా టెస్టుల సంఖ్య 8,22,71,654 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.