ఏపీలో 24 వేలు దాటిన కొత్త కేసులు

ఏపీలో 24 వేలు దాటిన కొత్త కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఇవాళ ఆదివారం సెలవు రోజు కాబట్టి కాస్త కేసులు తగ్గుతాయోమోనన్న ఆశలను అడియాసలు చేస్తూ.. రోజు రోజుకూ కొత్త కేసులతోపాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 94 వేల 550 మందికి పరీక్షలు చేయగా 24 వేల 171 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే గడచిన 24 గంటల్లో 101 మంది చనిపోయారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 21 వేల 101 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా మరణాల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14 మంది చనిపోయారు. అలాగే విశాఖపట్టణంలో 11 మంది, చిత్తూరులో 10 మంది, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, నెల్లూరులో ఏడుగురు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మొత్తం 101 మంది మరణించారు.