అమరావతి: ఏపీలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో అన్నదానం (పంక్తి భోజనాలకు) బదులు ఆహారం ప్యాకెట్లు అందించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేవాదాయశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా అన్నదాన సత్రాల్లో సహ పంక్తి భోజనాలను వెంటనే నిలిపివేస్తూ.. భక్తుల భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.భోజనం ప్యాకెట్లో సాంబారు అన్నం, దద్దోజనం ఉండాలంటూ పలు సూచనలు చేసింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంతోపాటు శ్రీశైలం, ద్వారకా తిరుమల, తదితర ఆలయాల్లో సోమవారం నుండి అన్నదానాన్ని (పంక్తి భోజనాలను) నిలిపివేయాలని నిర్ణయించారు. అన్నదానం ఆగిపోయినా ఆలయాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా భోజనం ప్యాకెట్లను అందిస్తారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. శ్రీశైలంలోని అన్నపూర్ణ సత్రం సోమవారం నుండి పంక్తి భోజనాలను నిలిపివేసి భోజనం ప్యాకెట్ల పంపిణీ ప్రారంభించారు.భక్తుల రద్దీకి అనుగుణంగా పులిహోర, పెరుగన్నం, సాంబారన్నంతోపాటు నీళ్ల ప్యాకెట్ల పంపిణీ చేస్తామని దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, అన్నపూర్ణ సత్రం ఇంచార్జ్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించేలా భక్తులకు నిరంతరం సూచనలు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరించేలా చేస్తున్నామని వారు వివరించారు.
ఏపీలోని ఆలయాల్లో అన్నదానం నిలిపివేత
- ఆంధ్రప్రదేశ్
- March 23, 2021
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు