హాస్టల్‌లో కరోనా.. 52 మంది విద్యార్థినీలకు పాజిటివ్

హాస్టల్‌లో కరోనా.. 52 మంది విద్యార్థినీలకు పాజిటివ్


కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నూల్ జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌లో కరోనా కలకలం చెలరేగింది. హాస్టల్‌లో ఉంటున్న 52 మంది విద్యార్థినీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా.. ప్రిన్సిపాల్ శాంతి కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వైద్య అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది.