
దుబాయ్లోని ఒక భారతీయ విద్యార్థి కి కరోనా వైరస్ (కొవిడ్-19) సోకినట్టు నిర్ధారణ అయింది. విదేశాలకు వెళ్ళిన విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అతనికి ఇన్ఫెక్షన్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ) తెలిపింది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొత్తం కరోనా బాధిత కేసుల సంఖ్య 27 కి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. విదేశాలకు వెళ్లి దుబాయ్కి తిరిగి వచ్చిన అయిదు రోజుల తర్వాత బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడ్డారు. దీంతో మొత్తం కుటుంబాన్ని క్వారంటైన్ చేసిన ఆరోగ్య అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో విద్యార్థికి పాజిటివ్ రాగా, మిగిలిన కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా గురువారం నుంచి స్కూలు మూసివేస్తున్నట్టు ఇండియన్ హై గ్రూప్ ఆఫ్ స్కూ ప్రకటించింది. స్కూలువిద్యార్థులు, సిబ్బందికి డిహెచ్ఎ అధికారులు పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.