శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కరోనాతో ఓ వ్యక్తి బాత్రూంలోనే కుప్పకూలిపోయాడు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువైపోతోంది. దాంతో రిమ్స్ ఆస్పత్రికి కరోనా పేషంట్లు క్యూ కడుతున్నారు. కరోనాతోనే కాకుండా.. ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల కూడా పేషంట్లు చనిపోతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో భాస్కర్ అనే వ్యక్తి కరోనా చికిత్స పొందుతున్నాడు. అయితే అతను బాత్రూంకి వెళ్లిన సమయంలో కూడా ఆక్సిజన్ కెనాల్స్ వెంట తీసుకువెళ్లాల్సి వచ్చింది. అయితే బాత్రూంలోకి వెళ్లిన తర్వాత ఆక్సిజన్ సరఫరా సరిగా జరగకపోవడంతో భాస్కర్.. బాత్రూంలోనే కుప్పకూలిపోయాడు.