దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 వేల 579 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో సగం కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో ఒక్కరోజు 3వేల 698మందికి పాజిటివ్ వచ్చింది. దేశంలో 543 రోజుల కనిష్ట స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా నుంచి 12 వేల 202 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 236 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో లక్షా 13 వేల 584 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఒక శాతం లోపే ఉందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. రికవరీ రేటు 98.32 శాతంగా నమోదు అయిందని తెలిపారు అధికారులు.
ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 117 కోట్ల 63లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. గత 24 గంటల్లో జనాలకు 71 లక్షల 92వేల 154 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. మొత్తం 131 కోట్ల 45 లక్షల 3వేల 460 కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేశామని పేర్కొంది. ఇంకా 21 కోట్ల 92లక్షల 56వేల 121 డోసుల వ్యాక్సిన్ రాష్ట్రాల దగ్గర నిల్వ ఉందని తెలిపారు అధికారులు.