కరోనా లాక్డౌన్ తో తీవ్రంగా ఇబ్బందులు పడిన జనానికి ఢిల్లీ ఎయిమ్స్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అయితే వ్యాక్సిన్ పంపిణీలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ‘ఇండియా టుడే హెల్త్గిరి అవార్డ్స్ 2020 సందర్భంగా ఇవాళ(శుక్రవారం) ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు, వ్యాక్సిన్ సమర్థత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే ఏడాది ప్రారంభం వరకు వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ప్రారంభంలోనే దేశ జనాభా మొత్తానికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాదన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి ముందుగా ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంలో పనిచేసేవారిని, కరోనా వారియర్స్ను ఒక వర్గంగానూ… కరోనాతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని మరొక వర్గంగానూ విభజించి వీరికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడంపై ఆలోచనలు జరుగుతున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఇవ్వడంతో ప్రాధాన్యతా క్రమాన్ని కచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు రణదీప్ గులేరియా.
జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ : AIIMS డైరెక్టర్ రణదీప్ గులేరియా
- దేశం
- October 3, 2020
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు