డాక్టర్ పై ఉమ్మి వేసిన కరోనా రోగి

డాక్టర్ పై ఉమ్మి వేసిన కరోనా రోగి

కరోనా వైరస్ సోకిన బాధితుడు డాక్టర్ పై ఉమ్మి ఊయడం కలకలం రేగుతోంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మూడు వారాల క్రితం యూఎస్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలున్నాయి. దీంతో  అత్యవసర చికిత్స కోసం తిరుచిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు.  అయితే వైద్యం నిమిత్తం ఆస్పత్రిలోకి చేరిన బాధితుడు డాక్టర్లకు సహకరించలేదు. తనకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడిపై ఉమ్మి వేశాడు. దీంతో డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో డాక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన కరోనా బాధితుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరో వైపు కరోనా వైరస్ లక్షణాలున్నా, కరోనా వైరస్ సోకిన బాధితులు చికిత్స తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ,  వైద్య పరీక్షలకు లోబడి ఉండాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.