
రోమ్: ఇటలీలోని రెండు పెద్ద సిటీల్లో గతేడాది డిసెంబర్లోనే కరోనా ఉందట. తొలి కేసు నమోదవడానికి రెండు నెలల ముందుగానే అక్కడ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయట. వేస్ట్ వాటర్పై ఇటలీ నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. మిలాన్, టురిన్ ప్రాంతాల్లో డిసెంబర్ చివరిలో సేకరించిన వేస్ట్ వాటర్ శాంపిల్స్లో సార్స్ కోవ్ 2 జెనెటిక్ ట్రేసెస్ ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. అలాగే బోలోగ్నా సిటీలో జనవరిలో సేకరించిన శాంపిల్స్లో కూడా వైరస్ మూలాలు బయటపడ్డాయని ఐఎస్ఎస్ ఇనిస్టిట్యూట్ శుక్రవారం రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో పేర్కొంది. నిజానికి ఇటలీలో తొలి కరోనా కేసు ఫిబ్రవరి మధ్యలో నమోదయ్యింది. కానీ తాజా స్టడీ ప్రకారం డిసెంబర్లోనే వైరస్ మూలాలు కనిపించాయని తేలింది. ఈ రిజల్ట్స్ ఆధారంగా ఇటలీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడి నుంచి మొదలైందనే విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఐఎస్ఎస్ పేర్కొంది. ఎర్లీ డిటెక్షన్ టూల్ ద్వారా మురుగునీటి నమూనాలను వ్యూహాత్మకంగా పరిశీలించామని, వీటిని ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఇంటర్నేషనల్ ఎవిడెన్స్గా పరిగణించవచ్చని తెలిపింది.
యూరోప్లో తొలి దేశం
కరోనా వైరస్ బారిన పడిన తొలి యూరోపియన్ దేశం ఇటలీనే. ఆ దేశంలో ఫిబ్రవరిలో తొలి కరోనా కేసు నమోదైంది. దానిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన మొట్టమొదటి దేశం కూడా అదే. చైనా టూరిస్టులు కాకుండా ఇటలీలో కేసు లాంబార్డీ రీజియన్లోని కోడోగ్నో టౌన్లో మొదటి కరోనా పేషెంట్ను గుర్తించారు. ఫిబ్రవరి 21న ఇటలీ ప్రభుత్వం కోడోగ్నో టౌన్ను రెడ్ జోన్గా ప్రకటించింది. ఆ తర్వాత లాంబార్డీ రీజియన్లోని మిగతా టౌన్లు, సిటీలకు కూడా రెడ్ జోన్ను విస్తరించింది. మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా షట్డౌన్ను అమలులోకి తెచ్చింది. ఇటలీలో ఇప్పటి వరకూ 34 వేలమందికి పైగా కరోనాతో మరణించారు.
ఎర్లీ వార్నింగ్ సిస్టం
ఐఎస్ఎస్ వాటర్ క్వాలిటీ ఎక్స్పర్ట్ గుసెప్పినా లా రోసా. ఆమె టీమ్ 2019 అక్టోబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకూ 40 వేస్ట్ వాటర్ శాంపిల్స్ను పరీక్షించింది. రెండు వేర్వేరు విధానాల ద్వారా రెండు డిఫరెంట్ ల్యాబోరేటరీల్లో చేసిన టెస్టుల్లో మిలాన్, టురిన్ ల్లో డిసెంబర్ 18న, బోలోగ్నాలో జనవరి 29న సేకరించిన శాంపిల్స్లో సార్స్ కోవ్ 2 వైరస్ ఉన్నట్టు నిర్థారణ అయ్యిందని చెప్పారు. అక్టోబర్, నవంబర్లో తీసిన శాంపిల్స్లో మాత్రం వైరస్ నెగెటివ్ వచ్చిందని, అప్పటికి వైరస్ రాలేదని లా రోసా చెప్పారు. ఫ్రాన్స్లో ఆస్పత్రిలో చేరిన పేషెంట్ల శాంపిల్స్ను ఎనలైజ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా ఈ డేటాను కన్ఫామ్ చేశారు. ఇది డిసెంబర్ చివరి నాటి సార్స్ కోవ్ 2 పాజిటివ్ కేసులకు అనుకూలమైనదిగా ఆ ఇనిస్టిట్యూట్ పేర్కొంది. స్పెయిన్ తాజా స్టడీలో బార్సిలోనాలో జనవరిలో కలెక్ట్ చేసిన వేస్ట్ వాటర్ శాంపిల్స్ జెనెటిక్ ట్రేసెస్ ఉన్నట్టు తేలింది. స్పెయిన్లో తొలి కేసు నమోదవడానికి 40 రోజుల ముందే అక్కడ్ వైరస్ మూలాలు ఉన్నట్టు బయటపడింది.
మెజారిటీ కేసుల్లో నో సింప్టమ్స్
కరోనా మహమ్మారి మొదలైన కొత్తలో వైరస్ వ్యాప్తిని తెలుసుకునేందుకు వేస్ట్ వాటర్లో జెనెటిక్ ట్రేసెస్ ఉన్నాయో లేదో రీసెర్చర్లు టెస్టులు చేశారు. బ్రిస్బేన్ మొదలుకుని పారిస్, ఆమ్స్టర్డ్యామ్ వరకూ ఇదే పద్ధతిని అనుసరించారు. రికార్డవుతున్న కరోనా కేసుల్లో మెజారిటీ శాతం తక్కువ లేదా అసలు సింప్టమ్స్ లేకపోవడమే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల వేస్ట్ వాటర్ను టెస్ట్ చేయడం ద్వారా వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి రీసెర్చర్లు.. వైరస్ బయటపడని, తొలి కేసులు అప్పుడే నమోదైన ప్రాంతాల్లో ఈ రకమైన టెస్టులు చేసేవారు. సీవర్స్, ప్యూరిఫికేషన్ ప్లాంట్లలో రెగ్యులర్గా శాంపిల్స్ కలెక్ట్ చేయాలని ఇటలీ హెల్త్ మినిస్ట్రీని ఐఎస్ఎస్ సూచించింది.