ఐవోసీ బిల్డింగ్ కు కార్పొరేట్​ హంగులు : కలెక్టర్​ ప్రశాంత్ ​జీవన్​ పాటిల్​

 ఐవోసీ బిల్డింగ్ కు కార్పొరేట్​ హంగులు : కలెక్టర్​ ప్రశాంత్ ​జీవన్​ పాటిల్​

హుస్నాబాద్​, వెలుగు : హుస్నాబాద్​లో మూడున్నర ఎకరాల్లో రూ.17 కోట్లతో నిర్మిస్తున్న ఐవోసీ బిల్డింగ్​లో కార్పొరేట్​ స్థాయిలో అన్ని హంగులు సమకూరుతున్నాయని సిద్దిపేట కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ అన్నారు. శుక్రవారం ఆర్డీవో  బెన్​శాలోంతో కలిసి ఆయన బిల్డింగ్​ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ డివిజన్​లో ఉన్న ఆర్డీవో, తహసీల్దార్, ఇంజినీరింగ్, ఆర్ అండ్ బీ, -పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, ఆటవీ రేంజ్, ఎస్​టీవో ఆఫీసులన్నీ ఇందులో ఉంటాయన్నారు. ఇందులో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, పార్కింగ్​తోపాటు  అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆఫీస్ కాంప్లెక్స్ వరకు బటర్​ఫ్లై  లైట్స్ పెడుతున్నట్టు తెలిపారు. ఆయన వెంట డీటీవో బాలరాజు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.