- రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ప్రొఫైల్ తయారు చేస్తం
- ప్రభుత్వ మెడికల్ కాలేజీలు టెక్నాలజీ వాడుకోవాలి
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
గోదావరిఖని, వెలుగు : సర్కారు దవాఖానల్లో కార్పొరేట్స్థాయి వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ఆవరణలో రూ.142 కోట్ల సింగరేణి నిధులతో ఐదు అంతస్తుల్లో చేపట్టనున్న 355 అదనపు గదుల నిర్మాణ పనులకు మంత్రి, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్తో కలిసి భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ.10 లక్షలకు పెంచిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో రెండు వేల మంది వినియోగించుకున్నారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో టెక్నాలజీ వాడుకోవాలని, దానికి అవసరమైన నిధులు సమకూరుస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మెషీన్ లెర్నింగ్పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గ్యాస్ సబ్సిడీని 24 గంటల్లోనే జమ చేస్తున్నామన్నారు.
నిరుపేద ఆటో డ్రైవర్లకు ఇండ్ల స్థలాలు
రామగుండం ప్రాంతంలో నిరుపేద ఆటో డ్రైవర్లకు ఇండ్ల స్థలాలిస్తామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రామగుండం మెడికల్ కాలేజీకి అనుసంధానంగా నర్సింగ్ కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్పొరేషన్లో అవసరమైన చోట బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. గోదావరిఖనిలోని రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధిపై సింగరేణి దృష్టి పెట్టాలని, ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో స్థానిక యువతకు 80 శాతం మేర ఉపాధి కల్పించడంలో సహకరించాలన్నారు. ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీలు సైతం స్థానిక యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రామగుండంలో యువతకు పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యం కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ముందుగా పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ మంజూరు చేశామన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్మాట్లాడుతూ సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని పట్టాలు రాని వారికి ఇండ్ల పట్టాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేషన్అభివృద్ధికి మంత్రి శ్రీధర్బాబు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. మేయర్అనిల్ కుమార్, కలెక్టర్ముజమ్మిల్ఖాన్, రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్, కార్పొరేషన్కమిషనర్ సీహెచ్శ్రీకాంత్, సింగరేణి జనరల్ మేనేజర్లు చింతల శ్రీనివాస్, ఎల్వి సూర్యనారాయణ, తహశీల్దార్ కుమారస్వామి, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్, మెడికల్కాలేజీ ప్రిన్సిపాల్హిమబిందు సింగ్ పాల్గొన్నారు.