కరీంనగర్ జిల్లాలో హిమోఫిలియోపై అవగాహన సదస్సు

 కరీంనగర్ జిల్లాలో హిమోఫిలియోపై అవగాహన సదస్సు

కరీంనగర్ టౌన్, వెలుగు: పెద్దపల్లి హోమియో సొసైటీ, కరీంనగర్ జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో హిమోఫిలియో వ్యాధిగ్రస్తులకు కరీంనగర్ సిటీలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌లుగా ఐఎంఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాంకిరణ్​, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శైలజ,సెక్రటరీ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌గా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిమోఫిలియో పేషెంట్లకు సంబంధించిన మెడిసిన్‌‌‌‌‌‌‌‌ గత 5 నెలలుగా ప్రభుత్వ హాస్పిటళ్లలో కొరత ఉందని, ఖర్చుతో కూడుకున్న మందుపై ప్రభుత్వం దృష్టి సారించి అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. 

కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంవో రవీన, ఉదయ్, హిమోఫిలియో ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, కృష్ణమూర్తి, పెద్దపల్లి సొసైటీ చాప్టర్ సభ్యులు వాసుదేవరావు, ప్రెసిడెంట్ మురళీకృష్ణ, రాంప్రసాద్, శ్రీనివాస్, మహేశ్‌‌‌‌‌‌‌‌, క్రాంతి, రమేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.