బస్తీ ఓటర్లపైనే కార్పొరేటర్ క్యాండిడేట్ల ఫోకస్

బస్తీ ఓటర్లపైనే కార్పొరేటర్ క్యాండిడేట్ల ఫోకస్

బస్తీమే సవాల్

2,700 బస్తీల్లోని ఓటర్లపైనే కార్పొరేటర్ క్యాండిడేట్ల ఫోకస్

ఆ ఓట్లు పడితే గెలుపు ఖాయమన్న ధీమా..

బస్తీల్లో ప్రచారం చేసేందుకు స్పెషల్​ ప్లాన్లు

హైదరాబాద్​, వెలుగు: గ్రేటర్​ ఎన్నికల్లో పోటీచేస్తున్న క్యాండిడేట్లు బస్తీలపై ఫోకస్​ పెట్టారు. బస్తీ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీల వాళ్లు స్పెషల్​ ప్లాన్లను రెడీ చేస్తున్నారు. ‘బస్తీ మే సవాల్’ అంటూ చాలెంజ్​కు సిద్ధమవుతున్నారు. బస్తీల్లో దాదాపు 90% దాకా పోలింగ్​ నమోదవుతుండడంతో.. అక్కడి ఓట్లు పడితే గెలుపు ఖాయమని భావిస్తున్నారు.

500 నుంచి 5 వేల ఓట్లు

గ్రేటర్​ హైదరాబాద్​లోని 150 డివిజన్లలో మొత్తంగా 2,700 దాకా బస్తీలున్నట్టు చెబుతున్నారు. అందులో అధికారికంగా 1,500 బస్తీలుంటే.. అనధికారికంగా మరో 1,200 దాకా ఉన్నాయి. కొన్ని డివిజన్లలో సగం ఓట్లు బస్తీల్లోనే ఉన్నాయి. ఒక్కో బస్తీలో కనీసం 500 వందల నుంచి 5 వేల వరకు ఓటర్లున్నారు. దాదాపు 25 శాతం ఓట్లు వాళ్లవే ఉన్నాయి. పోష్​ ఏరియాలు, అప్పర్​ మిడిల్​ క్లాస్​, మిడిల్​ క్లాస్​ ఓటర్లు చాలా మంది ఓట్లేసేందుకు ఇష్టపడట్లేదు. అందుకే కార్పొరేటర్​ క్యాండిడేట్లు బస్తీలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.

నమ్మిన పార్టీకే ఓట్లు!

బస్తీల్లో ఉండే వాళ్లందరికీ కామన్​ సమస్యలుంటున్నాయి. దీంతో ఆ సమస్యలు ఎవరు తీరుస్తారని నమ్ముతారో.. ఆ పార్టీ వాళ్లకే ఓట్లు వేస్తున్నారు. సిటీలోని సైదాబాద్​ డివిజన్​లో ఉన్న సింగరేణి బస్తీ అతి పెద్దది. పారిశుధ్య కార్మికులు, అడ్డా కూలీలు ఎక్కువగా ఉంటారు. అక్కడ 1,800 పక్కా ఇళ్లతో పాటు 1,200 గుడిసెలు ఉన్నాయి. 18 వేల ఓట్లు వీరివే. యూసుఫ్​గూడ డివిజన్​లోనూ దాదాపు 20 వేల ఓట్లున్నాయి. సికింద్రాబాద్​ పరిధిలోని అడ్డగుట్ట, బౌద్ధ నగర్​, అంబర్​పేట్​లోని పటేల్​నగర్​, రామాంతాపూర్​లోని  కేసీఆర్​ నగర్​, కేటీఆర్​ నగర్​ వంటి బస్తీలు, సోమాజీగూడలోని ఎంఎస్​ మక్తా, కుమ్మరి బస్తీలలో భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు.

బీజేపీ, కాంగ్రెస్​ ఫోకస్

అధికార పార్టీపై బస్తీల్లో మొదలైన వ్యతిరేకతను బీజేపీ, కాంగ్రెస్​లు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాము గెలిస్తే వరద సాయం టీఆర్​ఎస్​ కన్నా ఎక్కువ ఇస్తమని చెబుతున్నాయి. డబుల్​ బెడ్రూం ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా.. అవి పేదలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్​ లీడర్లు కూడా సిటీలో బస్తీలకు అన్ని సౌకర్యాలు కల్పించిందీ తామేనని చెబుతున్నారు.

For More News..

ఎన్నికల తర్వాత వరద సాయం డౌటే